Tuesday, March 31, 2009

చావుపుటకల సమస్య గురించి | చెలం

'శశిరేఖ ' గురించి రాస్తూ శ్రీ శివశింకరశాస్త్రి తన పీఠికలో-'ప్రేమ శాశ్వతమా చంచలమా అని కొందరు ప్రశ్నిస్తారు. గాడానురాగం శాశ్వతము కాదని యెవరనగలరు? అయితే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుందా, అనేక పర్యాయములు ఉదయిస్తుందా? ఈ విషయంలో భేదాలున్నవి. ప్రేమామృత ఝరి హృదయంలో నిరంతరమూ ప్రవహించేవారు ఎక్కువసార్లు ప్రేమించగలరు. ఏక కాలములో ఇద్దరు వ్యక్తులను మాత్రము సమానముగా ప్రేమించడం అసంభవం. ఒకరిమీద అనురాగం సడలిపోయిన తర్వాత ఇంకొకరిమీదికి ప్రసరించవచ్చును ' అని కథానాయికను జాగ్రత్తగా సమర్థిస్తూ ' ఈ కథానాయిక సామాన్య స్త్రీ కాదు. ఈమె ప్రేమైక జీవిని. అందుచేతనే తనకు యోగ్యుడైన ప్రియునికోసమై ఎట్టి త్యాగమైనా చేసింది. స్వాతంత్ర్యములేని సామాన్య స్త్రీలవంటి పతివ్రత ఈమె కాదు ' అని రూలింగ్ యిచ్చారు.

రామ్మూర్తి రత్నమ్మ, చలం-కృష్ణశాస్త్రి. సత్యవతి వీరి సంబంధాలను వ్యావహారిక జగత్తు నుంచి విడదీసి చూడడానికి తాత్త్వికమైన ప్రాతిపదికను శాస్త్రిగారు తమ పీఠికలో తెచ్చియిచ్చారు. శశిరేఖ గురించి చలమే ముగింపులో

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO